Rohith Sharma: న్యూజిల్యాండ్ మ్యాచ్.. ప్రాక్టీస్ కు దూరంగా రోహిత్...! 1 y ago
చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా సెమీస్ కు దూసుకెళ్లింది. అదే ఊపును ఆదివారం న్యూజిల్యాండ్ జరిగే చివరి లీగ్ మ్యాచ్లోనూ కొనసాగించాలనుకుంటోంది. ఈ మ్యాచ్ కోసం చేసిన ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ మాత్రం సాధనకు దూరంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఐసీసీ అకాడమీలో భారత ఆటగాళ్లు ఫుట్బాల్, రన్నింగ్ చేసి చెమటోడ్చుతుండగా, రోహిత్ మాత్రం కఠినమైన శారీరక కసరత్తులకు దూరంగా ఉన్నాడట. రోహిత్ స్వేచ్ఛగా కదలడం లేదని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.